
Sunday, January 4, 2009
వెన్న మురుకులు
కావలసినవి
బియ్యప్పిండి - 3 కప్పులు
సెనగపిండి - 1/2కప్పు
వేయించిన సెనగపప్పు పొడి (పుట్నాల పౌడర్)- 1 టేబుల్ స్పూన్
వెన్న - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
వాము - 1/2 టీ స్పూన్
నూనె -వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్దతి
1 )పైన చెప్పిన మూడురకాల పిండులను కలిపి జల్లించి పక్కన వుంచండి.
2 )పిండి లో ఉప్పు ,వెన్న ,వాము వేసి రెండు చేతులతో కలుపుతూ -నీళ్లు చేర్చి ముద్దలా చేయండి.
3 )మురుకులు(జంతికలు)గొట్టం తీసుకుని ,లోపల నూనె పూయండి. ఇప్పుడు పిండిముద్దను గొట్టం లో పెట్టి , కాగుతున్న వేడి నూనె లో మురుకులు గా తిప్పండి.వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వేయించిన మురుకుల్ని పేపర్ మీద పరిస్తే ఎక్కువైనా నూనె ను పీల్చుకుంటాయి.
4)ఇప్పుడు వేడి వేడి వెన్న మురుకులు తయారు..........
మిల్క్ మైసూర్ పాక్

కావలసినవి
పాలపొడి - 200 గ్రా
మైదా - 60 గ్రా
పంచదార - 1200 గ్రా
నెయ్యి - 500 గ్రా
తయారు చేసే విదానం 1
1)పాలపొడి, మైదాలలో యాబై గ్రాముల నెయ్యి ఫోసి మర్దించి విడిగా వుంచండి .
2)ఒక భానలిని స్టవ్ మీద పెట్టి పంచదార పోసి, అర లీటర్ నీళ్లు కలిపి పాకం పట్టండి. పాకం తీగ వస్తుండగా పాలపొడి, మైదా మిశ్రమాన్ని పోసి అట్లకాడతో కలియ పెడుతూఉండాలి.
౩)ఇప్పుడు వేడిచేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియ బెట్టండి మిశ్రమం దగ్గరగా, చిక్కగా అవుతున్నప్పుడు బానలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోసి అతిదులకు అందించండి.
పాలపొడి - 200 గ్రా
మైదా - 60 గ్రా
పంచదార - 1200 గ్రా
నెయ్యి - 500 గ్రా
తయారు చేసే విదానం 1
1)పాలపొడి, మైదాలలో యాబై గ్రాముల నెయ్యి ఫోసి మర్దించి విడిగా వుంచండి .
2)ఒక భానలిని స్టవ్ మీద పెట్టి పంచదార పోసి, అర లీటర్ నీళ్లు కలిపి పాకం పట్టండి. పాకం తీగ వస్తుండగా పాలపొడి, మైదా మిశ్రమాన్ని పోసి అట్లకాడతో కలియ పెడుతూఉండాలి.
౩)ఇప్పుడు వేడిచేసిన నెయ్యిని పంచదార పాకంలో నెమ్మదిగా పోస్తూ కలియ బెట్టండి మిశ్రమం దగ్గరగా, చిక్కగా అవుతున్నప్పుడు బానలిని దించి, ఆ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి చల్లారాక ముక్కలుగా కోసి అతిదులకు అందించండి.
Subscribe to:
Posts (Atom)