Saturday, May 16, 2009

అపోలో ఫిష్

కావాల్సినవి:
చందువా చేప - 500గ్రా
నిమ్మకాయ - సగం చెక్క
కొత్తిమీర - ఒక కట్ట
పెరుగు-ఒక కప్పు
గుడ్డు- ఒకటి
మైదా- 100గ్రా
కార్న్ ఫ్లోర్- 50గ్రా
ఉప్పు- తగినంత
మిరియాల పొడి- పావు టీ స్పూన్
రెడ్ ఆరెంజ్ కలర్ -చిటికెడు
కరివేపాకు-పది రెబ్బలు
పచ్చి మిర్చి- 25గ్రా
నూనె- వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) ముందుగా చందువా చేపను శుభ్రం చేసి ముళ్ళు లేకుండా రెండు అంగుళాల ముక్కలుగా కోసి ,వాటికి నిమ్మరసం ,ఉప్పు,మిరియాల పొడి కలిపి అర్ధ గంట పాటు నానబెట్టాలి.
2) తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగులగొట్టి దానిలో మైదా,కార్న్ ఫ్లోర్ కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి చిటికెడు రెడ్ ఆరెంజ్ కలర్ కూడా కలపండి.
3) ఇప్పుడు నానబెట్టిన చేప ముక్కల్ని పిండిలో ముంచి,మరుగుతున్న నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టండి.
4) తరువాత ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి కాగాక అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు,కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసాక,పెరుగు వేసి వెంటనే ఫ్రై చేసిన చేప ముక్కల్ని కూడా వేసి పెరుగు ఇగిరే వరకు ఫ్రై చేసి,రైస్ తో వడ్డించండి.

చికెన్ సీక్ కబాబ్

కావాల్సినవి:
చికెన్ కీమా - 300గ్రా
అల్లం- 25గ్రా
పచ్చి మిర్చి- 25గ్రా
కొత్తి మీర- ఒక కట్ట
గరం మసాల- 2గ్రా
పెరుగు మీగడ-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి,తరువాత దానిలో సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని,పచ్చిమిర్చి ముక్కల్ని ,కొత్తిమీర, గరం మసాల పొడి వేసి ,తగినంత ఉప్పు,పెరుగు మీగడ కలిపి ఉంచండి.
2) కొంచెం మందంగా ఉన్న ఇనుప చువ్వను తీసుకుని దానికి చుట్టూరా ఈ చికెన్ కీమా మిశ్రమాన్ని ఎనిమిది అంగుళాల పొడవునా చేతితో పట్టించండి.
3) ఇప్పుడు బొగ్గుల కుంపటి ఫై ,నిప్పులు ఎర్రగా తయారయ్యాక చికెన్ మిశ్రమం అంటించిన ఇనుప చువ్వలను నిప్పు సెగ చూపుతూ ,కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేవరకు వుంచండి.తరువాత చువ్వ నుండి కబాబ్ ను కిందికి లాగి,ప్లేట్ లో అమర్చి ,ఉల్లిపాయ ,నిమ్మ కాయ చక్రాలతో అలంకరిస్తే చికెన్ సీక్ కబాబ్ రెడీ.....

Tuesday, May 12, 2009

ఫ్రైడ్ మీట్ బాల్స్

కావాల్సినవి:
కీమా- 500గ్రా
మైదా- 150గ్రా
మిరియాల పొడి- 5గ్రా
ఈస్ట్- 5గ్రా
వెనిగర్- 5టీ స్పూన్లు
కారం- అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి- అర టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) కీమాను శుభ్రం చేసి నీరు పిండివేయాలి .ఇందులో ఉప్పు,అల్లంవెల్లుల్లి ,కారం,కాస్త మిరియాల పొడి,వెనిగర్ కలిపి అరగంట సేపు నానా బెట్టండి.
2) ఒక గిన్నెలో మైదా,ఈస్ట్,ఉప్పు,మిగిలిన మిరియాలపొడి వేసి తగినన్ని నీళ్లు కలిపి బజ్జీల పిండిలా చేయండి.దీన్ని అరగంట సేపు పక్కన వుంచండి.
3) నానబెట్టిన కీమాను ఉండలుగా చేసుకుని వీటిన ముందు కలిపి వుంచుకున్న పిండిలో ముంచి-వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయండి.ఫ్రైడ్ మీట్ బాల్స్ రెడీ...

కోవా పూరి

కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార- ఒక కే జి
పచ్చి కోవా- 250 గ్రా
జాపత్రి-2 గ్రా
యాలకులు- 2గ్రా
సెనగ పిండి- 50 గ్రా
వంట సోడా- పావు టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్
నెయ్యి- 125 గ్రా
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) పచ్చి కోవాకు సెనగపిండిని కలిపి ఒక గిన్నె లో కొంచెం వేయించి దించి దానిలో జాపత్రిపొడి ,యాలకుల పొడి,కొంచెం చక్కెరకలిపి ముద్ద చేసి వుంచుకోవాలి. 2) ఒక బాణలి లో మిగిలిన చక్కెరను పోసాక-రెండు గ్లాసుల నీళ్ళు పోసి జిలేభి పాకంలా లేతగా వచ్చే వరకు ఉంచి దించి పక్కన పెట్టండి. 3 ) మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించండి. దానిలో - కరగబెట్టిన నెయ్యి కలిపి ,రెండు చేతులతోనూ పిండిని బాగా కలిపి తగినన్ని నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా తయారు చేసుకోండి.
4 ) తరువాత నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకొని ,మద్య లో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి ,అంచులను తడి చేసి,కోవాకు దగ్గరగా అంచులను చుట్టి కజ్జి కాయలా మడత పెట్టండి.
5) ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి,చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ....