Saturday, May 16, 2009

అపోలో ఫిష్

కావాల్సినవి:
చందువా చేప - 500గ్రా
నిమ్మకాయ - సగం చెక్క
కొత్తిమీర - ఒక కట్ట
పెరుగు-ఒక కప్పు
గుడ్డు- ఒకటి
మైదా- 100గ్రా
కార్న్ ఫ్లోర్- 50గ్రా
ఉప్పు- తగినంత
మిరియాల పొడి- పావు టీ స్పూన్
రెడ్ ఆరెంజ్ కలర్ -చిటికెడు
కరివేపాకు-పది రెబ్బలు
పచ్చి మిర్చి- 25గ్రా
నూనె- వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) ముందుగా చందువా చేపను శుభ్రం చేసి ముళ్ళు లేకుండా రెండు అంగుళాల ముక్కలుగా కోసి ,వాటికి నిమ్మరసం ,ఉప్పు,మిరియాల పొడి కలిపి అర్ధ గంట పాటు నానబెట్టాలి.
2) తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగులగొట్టి దానిలో మైదా,కార్న్ ఫ్లోర్ కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి చిటికెడు రెడ్ ఆరెంజ్ కలర్ కూడా కలపండి.
3) ఇప్పుడు నానబెట్టిన చేప ముక్కల్ని పిండిలో ముంచి,మరుగుతున్న నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టండి.
4) తరువాత ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి కాగాక అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు,కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసాక,పెరుగు వేసి వెంటనే ఫ్రై చేసిన చేప ముక్కల్ని కూడా వేసి పెరుగు ఇగిరే వరకు ఫ్రై చేసి,రైస్ తో వడ్డించండి.

No comments:

Post a Comment