Saturday, February 28, 2009

బెల్లం జిలేబి

కావాల్సినవి:
మైదా- 600 గ్రా
సోడా-అర టీ స్పూన్
పెరుగు-ఒక కప్పు
బెల్లం-1 1/4 కే జి
తయారు చేసే విధానం:
1 ) ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాకి చిటికెడు సోడా,పెరుగుకలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టండి.ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి,కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా (అంటే చపాతీ పిండి కంటే జారుడుగా) చేసి పన్నెండు గంటలు నానబెట్టాలి.ఇలా చేస్తే పిండి బాగా పులుస్తుంది.
2 ) బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పాకం తయారు చేయండి.పాకం లేతగా ఉండగానే దించండి.
3 ) ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి కాగిన తరువాత -పిండిని గట్టి జిలేబీ వస్త్రంలో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పండి.వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి తీస్తే తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.
4 ) పద్నాలుగు అంగుళాల చతురస్రాకారంగా ఉన్నా గట్టి వస్త్రానికి మద్యలో చిన్న రంధ్రం చేయండి. దీన్ని దారంతో బటన్ కాజాకి కుట్టిన రీతిలో కుడితే జిలేబి వస్త్రం తయారవుతుంది. ........

Friday, February 27, 2009

ఎగ్ హల్వా

కావాల్సినవి:
పాలు- అర లీటరు
గుడ్లు-అర డజను
చక్కర - 150 గ్రా
జీడిపప్పు-20 గ్రా
బాదం పప్పు- 20 గ్రా
పిస్తా పప్పు-10 గ్రా
చాకొలేట్ పౌడర్-2 టేబుల్ స్పూన్లు
నెయ్యి- 100 గ్రా
వెనీలా ఎసెన్స్ -1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి అందులో చక్కెర పోసి కలియబెట్టాక, పాలు పోసి బాగా కలపండి.తరువాత అందులోనే చాకొలేట్ పౌడర్ ,జీడిపప్పు,బాదం,పిస్తా,పప్పులను కలిపి పక్కన వుంచండి. 2) తరువాత బాణలిలో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి కాచాక,సన్నటి మంట మీద ఉంచి-పాలు,కోడిగుడ్ల మిశ్రమాన్ని కొంచెంకొంచెం పోస్తూ కలియబెడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు గట్టిపడి హల్వా తయారవుతుంది.అది ఇంకా దగ్గరకు వచ్చాక ,దించి ,వెనీలా ఎసెన్స్ కలిపి ,డిష్ లోకి మార్చి అతిధులకు అందించాలి.

సునేరి భేండి

కావాల్సినవి:

బెండకాయలు- 250 గ్రా
సెనగపిండి- 50 గ్రా
కారం- అర టీ స్పూన్
చాట్ మసాలా- అర టీ స్పూన్
ఉప్పు-తగినంత

నూనె-ఫ్రై చేయడానికి సరిపడా

తయారు చేసే విధానం:

1 ) బెండకాయలను చాకుతో అడ్డంగా రెండు ముక్కలుగా కోసి మళ్లీ నిలువుగా రెండు ముక్కలుగా చీల్చండి.

2) ఈ ముక్కల్ని ఒక వెడల్పు గిన్నెలో వేసి-సెనగపిండి ,కారం,చాట్ మసాలా,తగినంత ఉప్పు,కలపండి.తరువాత కొంచెం నీళ్లు పోసి కలపండి.
3 ) ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాచాక-సెనగపిండి మిశ్రమంలో వున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసి తీస్తే సునేరి భేండి రెడీ... దీనికి వేయించిన జీడిపప్పు కూడా కలిపితే చాలా బావుంటుంది.

అన్నమయ్య లడ్డు

కావాల్సినవి:
సెనగ పిండి- 1కే జి
పంచదార- 1 కే జి 300 గ్రా
మిశ్రీ బిళ్ళలు- 100 గ్రా
యాలకుల పొడి- 15 గ్రా
జీడిపప్పు - 100 గ్రా
నెయ్యి-వేయించడానికి సరిపడా
కిస్ మిస్- 100గ్రా
తయారు చేసే విధానం:
1) సెనగపిండిని జల్లించి-బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన వుంచండి.
2) చక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ పాకం తయారు చేయండి.(ఒకటిన్నర తీగల పాకం ఐతే చాలు)
3) బాణలిలో నెయ్యి పోసి కాగిన తరువాత-బూంది చట్రంలో సెనగపిండిని పోస్తూ బూంది తీయండి.బూంది మెత్తగా వేయించి పాకంలో వేస్తూ వుండాలి. పైన యాలకుల పొడి వేసి కలపండి.
4 ) పాకంలో వున్న బూంది నుండి సగం తీసి కొద్దిగా గ్రైండ్ చేయండి.దీన్ని మిగిలిన బూందిలో కలిపి -జీడిపప్పు,కిస్ మిస్,మిశ్రీ బిళ్ళలుకొంచెం కలిపి లడ్డూలుగా చుడితే -ఎంతో రుచిగా వుండే అన్నమయ్య లడ్డు తయార్..........

Tuesday, February 24, 2009

వెజ్ వడలు

కావాల్సినవి:
సెనగపప్పు- 50 గ్రా
మినపప్పు- 50 గ్రా
పెసరపప్పు-50 గ్రా
పచ్చిమిర్చి-పది
అల్లం-చిన్నముక్క
క్యాబేజీ -100 గ్రా
పచ్చి బఠానీ - 25 గ్రా
కాలీఫ్లవర్ -చిన్న ముక్క
ఉల్లిపాయలు-రెండు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు-తగినంత
నూనె-వేయించందానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) సెనగపప్పు,మినపప్పు,పెసరపప్పులను కలిపి శుభ్రంగా కడగండి.వీటిని రెండుగంటల సేపు నానబెట్టండి.నీళ్లు వార్చి సగం పప్పును తీసుకుని రుబ్బండి.
2 ) మిగిలిన సగం పప్పులో అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు ,కూరగాయముక్కలు,పచ్చి బఠానీ ,కొత్తిమీర, కరివేపాకు కలపండి.ఈ మిశ్రమాన్ని రుబ్బిన పిండి లో కలుపుకోవాలి.ఆ పైన ఉప్పు చేర్చండి.
3 ) నూనె బాగా కాగిన తరువాత ఈ పిండిని వడలుగా చేసుకొని దోరగా వేయించండి.వెజ్ వడలు రెడీ........

ఆలు బైగన్ కర్రీ

కావాల్సినవి:
వంకాయలు- 250 గ్రా
బంగాళా దుంపలు- 250 గ్రా
ఉల్లిపాయలు-60 గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర పొడి-పావు టీ స్పూన్
ధనియాల పొడి-అర టీ స్పూన్
పసుపు-చిటికెడు
టమోటాలు-నాలుగు
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా

తయారు చేసే విధానం:
1) తెల్ల వంకాయలు,బంగాల దుంపలను ముక్కలు గా తరిగి ఉప్పు నీటిలో వేయండి.
2 ) ఒక గిన్నెలో నూనె పోసి కాచాక-సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని సన్నటి సెగమీద వేయించండి.ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద ,కారం,ధనియాలు,జీలకర్ర పొడి తో పాటు పసుపు వేసి కాయగూరముక్కల్ని కూడా కలిపి వేయించండి.ముక్కల్లో నీరు ఇంకిపోతే గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించండి.
3) కూర ఉడికిన తరువాత టమోటాలని ,తరిగిన కొత్తిమీర వేసి కాసేపు ఉడికించి తరువాత దించాలి.దీనిని రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.

అటుకుల దోశ

కావాల్సినవి:
బియ్యం-2 కప్పులు
అటుకులు- అర కప్పు
చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు
మెంతులు-ఒక టీ స్పూన్
వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్
నూనె -తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.

Monday, February 23, 2009

చాంద్ బిస్కట్స్

కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార పొడి-పావు కేజి
యాలకులు- 3గ్రాAdd Video
వనస్పతి -పావు కేజీ
తయారు చేసే విధానం:
1) మైదాను జల్లించండి.మద్యలో గొయ్యిలా చేసి ,వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యేవరకు ఉంచండి.పిదప పంచదార పొడి చేర్చండి.ఇందులో కొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి.
2 )మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దన చేసి పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారు అవుతుంది.పైన యాలకుల పొడి కలపండి.
3 ) ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్నా చపాతీలా చేయండి. పదును ఉన్నా గ్లాస్ తో ఆ చపాతి గట్టిగా అద్దితే బిస్కట్లు రూపొందుతాయి.వీటిని ఒక ట్రేలో అమర్చి నూట ఎనభయి డిగ్రీల దగ్గర ఇరవయ్ నిమిషాలు బెక్ చేయండి .చాంద్ బిస్కట్స్ రెడీ....చల్లారిన తరువాత ఆరగించండి.

Friday, February 20, 2009

సమోసా చికెన్ కర్రీ

కావాల్సినవి:
చికెన్ బ్రెస్ట్ పీస్లు -రెండు
పనీర్-50 గ్రా
జీడిపప్పు- 20 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-మూడు
నిమ్మకాయ-ఒకటి
నూనె-వేయించడానికి సరిపడా
గ్రేవీ తయారీకి:
గసగసాలు- 25 గ్రా
జీడిపప్పు- 25 గ్రా
కారం-ఒకటిన్న టీ స్పూన్
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు- 50 గ్రా
పెరుగు- 100 గ్రా
గరం మసాల- 1గ్రా
పచ్చి మిర్చి-రెండు
టమోటాలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా
పసుపు-చిటికెడు
తయారు చేసే విధానం:
1 )ముందుగా ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించండి.తరువాత అందులో అల్లంవెల్లుల్లి ముద్ద,కారంపసుపు,రుబ్బిన మసాలముద్దను చేర్చి వేయించండి.ఆ తరువాత దానిలో పెరుగు,టమోటాముక్కలు ,పచ్చిమిర్చి వేసి మరిగిస్తే గ్రేవీ రెడీ అవుతుంది.
2)తురిమిన పనీర్ లో జీడిపప్పు,కొత్తిమీర,పచ్చి మిర్చి ,నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి.
3 )చికెన్ బ్రెస్ట్ పీస్లను ఆకు ఆకారం లో రెక్క జాయింట్ దగ్గర కోసి చేతితో లాగితే ఎముక మిగిలి చర్మం విడిపోతుంది.
4)ఈ చర్మంలో -పైన తయారు చేసిన మిశ్రమాన్ని కూరి ,సమోసా ఆకారంలో చికెన్ పీస్ ను మదచండి.చివరలు విడిపోకుండా దారం తో కట్టి-వాటిని బాణలిలో మరుగుతున్న నూనె లో వేయించి తీయండి.
5)ఇలా తయారైన సమోసాలను పైన సిద్ధం చేసిన గ్రేవీలో వేసి,పైన కొత్తిమీర జల్లి అతిధులకు అందించండి.

Thursday, February 12, 2009

పాలకూర పకోడీ

కావాల్సినవి:
పాలకూర-పది కట్టలు
సెనగపిండి-200 గ్రా
కారం పొడి-ఒక టీ స్పూన్
వంట సోడా-పావు టీ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
పసుపు-చిటికెడు

తయారు చేసే విధానం:

1)ముందు గా పాలకూర కాడలను తుంచాలి.ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి ఉంచండి .
2 )ఇప్పుడు సెనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నె లో జల్లించి దానికి తగినంత ఉప్పు,కారం,పసుపు,వంటసోడా కలిపి,నీళ్ళతో జారుడుగా బజ్జీల పిండిలా కలపండి.ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కలిపి బాణలిలో ఎర్రగా వేయించి,ప్లేట్లలో అమర్చి అతిధులకు అందించండి.





Monday, February 2, 2009

వెజ్ నేచురల్

కావలసినవి :
కేరేట్స్- 100గ్రా
బీన్సు- 100 గ్రా
ఆనపకాయ-ఒక ముక్క
టమోటాలు-రెండు
ఆవాలు- పావు టీ స్పూన్
జీలకర్ర-పావు టీ స్పూన్
పచ్చి మిర్చి-ఆరు
పసుపు-పావు టీ స్పూన్
గోధుమపిండి-3 టీ స్పూన్లు
కొత్తిమీర-ఒక కట్ట
నూనె-2 టీ స్పూన్లు
ఉప్పు- తగినంత
కరివేపాకు-కొంచెం
తయారు చేసే విధానం:
1)కూరగాయలన్నీ ముక్కలు గా కోసి ఉంచుకోవాలి.
2 )ఒక గిన్నెలో నూనె పోసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకుతో తాలింపు ఇవ్వండి.అందులో పచ్చిమిర్చి, గోధుమ పిండి,పసుపు చేర్చి కొద్ది సేపు వేయించాలి.
3)ఆ పైన కాయగూరముక్కలు (టమోటా ముక్కలు తప్ప),ఒకటిన్న గ్లాసులనీళ్లు పోసి సన్నటి మంట మీద ఉడికించండి.అవి కొంచెం ఉడికాక టమోటా ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక ,ఉప్పు ,కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాల తరువాత దించండి.అంతే వెజ్ నేచురల్ రెడీ...

Sunday, February 1, 2009

రవ్వ కజ్జికాయలు

కావాల్సినవి:
మైదా పిండి-అర కేజీ
నెయ్యి- 50 గ్రా
ఉప్పు-చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
పూర్ణం కోసం
నెయ్యి - 50 గ్రాb
బొంబాయి రవ్వ- 300 గ్రా
పంచదార- 400 గ్రా
కొబ్బరి తురుము- 100 గ్రా
యాలకులు- 5గ్రా
తయారు చేసే విధానం:
1) బొంబాయి రవ్వ,నెయ్యి కలిపి దొర గా వేయించి,అందులో పంచదార పొడి,వేయించిన కొబ్బరి తురుము,యాలకుల పొడి కలిపి పక్కన వుంచండి.
2)మైదాను జల్లించి -ఉప్పు,నెయ్యి కలపండి.దీన్ని నీళ్ళతో తడిపి గట్టి ముద్దలా చేసి పది నిమిషాలు సేపు వస్త్రాన్ని కప్పండి.తరువాత చిన్న చిన్న ఉండలు గా చేసి పూరీలు వత్తండి.దీని మద్య లో రెండు చెంచాల పూర్ణం మిశ్రమాన్ని ఉంచి రెండు అంచులూ దగ్గరకు చేర్చి గోరంచుగా మడత పెట్టండి.ఇలా చేసిన వాటిని నూనె లో దొరగా వేయిస్తే రవ్వ కజ్జికాయలు సిద్ధం...