Saturday, May 16, 2009

అపోలో ఫిష్

కావాల్సినవి:
చందువా చేప - 500గ్రా
నిమ్మకాయ - సగం చెక్క
కొత్తిమీర - ఒక కట్ట
పెరుగు-ఒక కప్పు
గుడ్డు- ఒకటి
మైదా- 100గ్రా
కార్న్ ఫ్లోర్- 50గ్రా
ఉప్పు- తగినంత
మిరియాల పొడి- పావు టీ స్పూన్
రెడ్ ఆరెంజ్ కలర్ -చిటికెడు
కరివేపాకు-పది రెబ్బలు
పచ్చి మిర్చి- 25గ్రా
నూనె- వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) ముందుగా చందువా చేపను శుభ్రం చేసి ముళ్ళు లేకుండా రెండు అంగుళాల ముక్కలుగా కోసి ,వాటికి నిమ్మరసం ,ఉప్పు,మిరియాల పొడి కలిపి అర్ధ గంట పాటు నానబెట్టాలి.
2) తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగులగొట్టి దానిలో మైదా,కార్న్ ఫ్లోర్ కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి చిటికెడు రెడ్ ఆరెంజ్ కలర్ కూడా కలపండి.
3) ఇప్పుడు నానబెట్టిన చేప ముక్కల్ని పిండిలో ముంచి,మరుగుతున్న నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టండి.
4) తరువాత ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి కాగాక అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు,కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసాక,పెరుగు వేసి వెంటనే ఫ్రై చేసిన చేప ముక్కల్ని కూడా వేసి పెరుగు ఇగిరే వరకు ఫ్రై చేసి,రైస్ తో వడ్డించండి.

చికెన్ సీక్ కబాబ్

కావాల్సినవి:
చికెన్ కీమా - 300గ్రా
అల్లం- 25గ్రా
పచ్చి మిర్చి- 25గ్రా
కొత్తి మీర- ఒక కట్ట
గరం మసాల- 2గ్రా
పెరుగు మీగడ-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి,తరువాత దానిలో సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని,పచ్చిమిర్చి ముక్కల్ని ,కొత్తిమీర, గరం మసాల పొడి వేసి ,తగినంత ఉప్పు,పెరుగు మీగడ కలిపి ఉంచండి.
2) కొంచెం మందంగా ఉన్న ఇనుప చువ్వను తీసుకుని దానికి చుట్టూరా ఈ చికెన్ కీమా మిశ్రమాన్ని ఎనిమిది అంగుళాల పొడవునా చేతితో పట్టించండి.
3) ఇప్పుడు బొగ్గుల కుంపటి ఫై ,నిప్పులు ఎర్రగా తయారయ్యాక చికెన్ మిశ్రమం అంటించిన ఇనుప చువ్వలను నిప్పు సెగ చూపుతూ ,కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేవరకు వుంచండి.తరువాత చువ్వ నుండి కబాబ్ ను కిందికి లాగి,ప్లేట్ లో అమర్చి ,ఉల్లిపాయ ,నిమ్మ కాయ చక్రాలతో అలంకరిస్తే చికెన్ సీక్ కబాబ్ రెడీ.....

Tuesday, May 12, 2009

ఫ్రైడ్ మీట్ బాల్స్

కావాల్సినవి:
కీమా- 500గ్రా
మైదా- 150గ్రా
మిరియాల పొడి- 5గ్రా
ఈస్ట్- 5గ్రా
వెనిగర్- 5టీ స్పూన్లు
కారం- అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి- అర టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) కీమాను శుభ్రం చేసి నీరు పిండివేయాలి .ఇందులో ఉప్పు,అల్లంవెల్లుల్లి ,కారం,కాస్త మిరియాల పొడి,వెనిగర్ కలిపి అరగంట సేపు నానా బెట్టండి.
2) ఒక గిన్నెలో మైదా,ఈస్ట్,ఉప్పు,మిగిలిన మిరియాలపొడి వేసి తగినన్ని నీళ్లు కలిపి బజ్జీల పిండిలా చేయండి.దీన్ని అరగంట సేపు పక్కన వుంచండి.
3) నానబెట్టిన కీమాను ఉండలుగా చేసుకుని వీటిన ముందు కలిపి వుంచుకున్న పిండిలో ముంచి-వేడి నూనెలో ఎర్రగా ఫ్రై చేయండి.ఫ్రైడ్ మీట్ బాల్స్ రెడీ...

కోవా పూరి

కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార- ఒక కే జి
పచ్చి కోవా- 250 గ్రా
జాపత్రి-2 గ్రా
యాలకులు- 2గ్రా
సెనగ పిండి- 50 గ్రా
వంట సోడా- పావు టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూన్
నెయ్యి- 125 గ్రా
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) పచ్చి కోవాకు సెనగపిండిని కలిపి ఒక గిన్నె లో కొంచెం వేయించి దించి దానిలో జాపత్రిపొడి ,యాలకుల పొడి,కొంచెం చక్కెరకలిపి ముద్ద చేసి వుంచుకోవాలి. 2) ఒక బాణలి లో మిగిలిన చక్కెరను పోసాక-రెండు గ్లాసుల నీళ్ళు పోసి జిలేభి పాకంలా లేతగా వచ్చే వరకు ఉంచి దించి పక్కన పెట్టండి. 3 ) మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించండి. దానిలో - కరగబెట్టిన నెయ్యి కలిపి ,రెండు చేతులతోనూ పిండిని బాగా కలిపి తగినన్ని నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా తయారు చేసుకోండి.
4 ) తరువాత నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీలా కొంచెం మందంగా చేసుకొని ,మద్య లో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి ,అంచులను తడి చేసి,కోవాకు దగ్గరగా అంచులను చుట్టి కజ్జి కాయలా మడత పెట్టండి.
5) ఇప్పుడు వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి,చక్కెర పాకంలో వేసి ముంచి తీస్తే కోవా పూరి రెడీ....

Monday, March 9, 2009

కార్న్ పాలక్ కర్రీ

కావాల్సినవి:
స్వీట్ కార్న్ - 200 గ్రా
పాల కూర- 4 కట్టలు
వెన్న- 2 టేబుల్ స్పూన్లు
నూనె- 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- పావు టీ స్పూన్
జీడిపప్పు,గసగసాల పేస్టు- 30 గ్రా
అల్లంవెల్లుల్లి పేస్టు- 10 గ్రా
పాలు-ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
టమోటా గుజ్జు -2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
కారం-తగినంత
పసుపు- చిటికెడు
తెల్ల మిరియాల పొడి -అర టీ స్పూన్
గరం మసాలా -పావు టీ స్పూన్
కొత్తి మీరా - అర కట్ట
క్రీమ్ - 1 టీ స్పూన్
తయారు చేసే విధానం:
1) ఒక గిన్నె లో వెన్న,నూనె వేడి చేసి ఉల్లిపయముక్కల్ని దోరగా వేయించండి. అల్లం,వెల్లుల్లి పేస్టు,మిరియాల పొడి,ఉప్పు,కారం,గరం మసాలా,పసుపు,టమోటా గుజ్జు వరుసగా వేసి సన్నని సెగ పై పది నిమిషాలు ఉడికించాలి.జీడిపప్పు గసగసాల పేస్టును కొంచెం పాలలో కలిపి వాటిని కూడా వేసి మరో పది నిమిషాల పటు ఉడకనిచ్చి గ్రేవీ తయారు చేసుకోవాలి.
2) మరొక గిన్నెలో వెన్న వేడి చేసి జీలకర్ర,సన్నగా తరిగిన పాలకూర, స్వీట్ కార్న్ వేసి పది నిమిషాలు వేయించాలి. దానిలో గ్రేవీ కలిపి ఇంకాసేపు ఉడికించాలి.పైన తరిగిన కొత్తి మీరా ,క్రీమ్ వేసి దించాలి.అంటే స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ...

కొబ్బరి లౌజు

కావాల్సినవి:
కొబ్బరికాయ - ఒకటి
బెల్లం- పావు కే జి
యాలకులు- నాలుగు
నెయ్యి - 50 గ్రా
తయారు చేసే విధానం:
1) ముందుగా కొబ్బరి కాయను కొట్టి తురుముకోవాలి. తరువాత బెల్లాన్ని కూడా మెత్తగా తరుగుకోవాలి.
2) ఇప్పుడు తరిగినబెల్లాన్ని,తురిమిన కొబ్బరిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా వున్నగిన్నె పెట్టి అందులో కలిపి వుంచుకున్న కొబ్బరి,బెల్లం మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు జల్లుతూ అడుగంటకుండా తిప్పుతూ వుండాలి.ఇలా నీళ్లన్నీ పోయేవరకు కలిపి గట్టిపడ్డాక కొంచెం నెయ్యి వేసి తిప్పుతూ యాలకుల పొడి కూడా వేసుకోవాలి..
3) ఇలా ఉడికిన కొబ్బరి మిశ్రమాన్ని స్టవ్ మీదనుండి దించి చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు గా చుట్టుకోవాలి..అంతే తీయని కొబ్బరి లౌజు రెడీ...

రవ్వ లడ్డు

కావాల్సినవి:
బొంబాయి రవ్వ - అర కే.జి
పంచదార -ఒక కే.జి
యాలకులు-ఐదు
జీడి పప్పు- పది
కిస్ మిస్- పది
పాలు - ఒక కప్పు
నెయ్యి- 100 గ్రా
తయారు చేసే విధానం:
1) బొంబాయి రవ్వను నెయ్యి వేయకుండా దోరగా వేయించి వుంచుకోవాలి. యాలకులు పొడి చేసి వుంచుకోవాలి.
2) వేయించిన రవ్వలో చక్కర కలిపి మందపాటి గిన్నెలో ఉంచి స్టవ్ ఫై పెట్టి సన్నటి సెగ ఫై వుంచి ,కొద్దిగా నెయ్యివేసి ,కొద్దిగా పాలు చల్లాలి.యాలుకపొడి,జీడిపప్పు,కిస్ మిస్ వేసి బాగా కలపాలి.
3) మరికిన్ని పాలు వేసి ఉండ అయ్యేలా కలపాలి.మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి దించాలి.పాలు తడి చేసుకుంటూ ఉండలు చేయాలి... ఇప్పుడు రవ్వ లడ్డు తినడానికి రెడీ..

మైసూర్ బజ్జీ

కావాల్సినవి:
మైదా - పావు కే.జి
గోధుమ పిండి - 125 గ్రా
బొంబాయి రవ్వ- 125 గ్రా
ఉప్పు -రుచికి సరిపడా
మజ్జిగ - ఒక కప్పు
నూనె - వేయించడానికి సరిపడా
బేకింగ్ పౌడర్ - పావు కప్పు
వంట సోడా - చిటికెడు
ఉల్లిపాయలు -రెండు కప్పుల ముక్కలు
పచ్చి మిర్చి- పది
తయారు చేసే విధానం:
1) ముందు గా మూడు పిండులను మజ్జిగ తో24 గంటల ముందు నానబెట్టుకోవాలి..ఇది మరీ పలుచన కాకుండా సరిపడా గట్టిగా కలుపుకోవాలి.
2 ) బజ్జేలను వేసే ముందు ఉప్పు,పచ్చిమిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బాగా కాగి వున్న నూనె లో వేసి వేగనివ్వాలి. అంతే వేడి వేడి మైసూరు బజ్జీ రెడీ.........

Sunday, March 8, 2009

రవ్వ దోశ

కావాల్సినవి:
బొంబాయి రవ్వ- ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
మైదా పిండి- అర కప్పు
పుల్లటి మజ్జిగ- ఒక గ్లాస్
అల్లం- పక చిన్న ముక్క
పచ్చిమిర్చి- ఐదు
జీలకర్ర- 2 టీ స్పూన్లు
నూనె- 50 గ్రా
ఉప్పు- తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా బొంబాయి రవ్వ,మైదా పిండి,బియ్యప్పిండి లను శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి.తరువాత ఈ మూడింటిని పుల్లటి మజ్జిగలో వేసి బాగా కలుపుకొని కొంత సమయం నాననివ్వాలి.
2 ) తరువాత ఇందులో ఉప్పు కలుపుకుని బాగా కాలిన పెనంఫై దోశలు పోసుకుని వాటి ఫై జీలకర్ర,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి. ఒక వైపు బాగా వేగిన తరువాత రెండో వైపు కూడా బాగా వేగనిచ్చి దోశ ను తీసుకోవాలి.అంతే వేడి వేడి రవ్వ దోశలు రెడీ... ,ఇవి కొబ్బరి చట్నీ తో బావుంటాయి....







Thursday, March 5, 2009

సబ్జీ గోస్ట్

కావాల్సినవి:
మటన్- 500 గ్రా
పాలకూర- 10 కట్టలు
నూనె- 70 మీ.లీ
అల్లంవెల్లుల్లి- 30 గ్రా
కారం- 15 గ్రా
పసుపు- 5 గ్రా
టమోటాలు- 200 గ్రా
గరంమసాలా -5 గ్రా
మెంతి కూర-4 కట్టలు
ఉల్లిపాయలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేసాక,బాగా కడిగి తరిగిన మెంతికూరను వేసి ఫ్రై చేసాక,అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేయండి.తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద,కారం,పసుపు వేసి అందులోనే కడిగి శుభ్రం చేసిన మటన్ ను వేసి బాగా కలియబెట్టండి.తరువాత తగినంత ఉప్పు కూడా చేర్చి మూత పెట్టి ఉడికించండి.
2 ) మటన్ ఉడుకుతుండగా అవసరమైతే కొన్ని నీళ్లు చల్లండి. మాంసం ఉడకగానే శుభ్రంగా కడిగి తరిగిన పాలకూరను,టమోటా ముక్కల్ని కూడా వేసి కలియబెట్టి బాగా ఉడికించండి. దాంతో పాలకూర కూడా ఉడికి సబ్జీ గోస్ట్ తయారు అవుతుంది.దించే ముందు గరం మసాలా చల్లి,వేడిగా పులావ్ తో గాని,వైట్ రైస్ తోగాని వడ్డించండి.

చుర్మా లడ్డు

కావాల్సినవి:
గోధుమపిండి- 500 గ్రా
నెయ్యి- ఫ్రై చేసేందుకు సరిపడా
చక్కెర పొడి- 400 గ్రా
యాలకుల పొడి-10 గ్రా
జీడి పప్పు- 25 గ్రా
కిస్ మిస్ లు- 25 గ్రా
తయారు చేసే విధానం:
1 ) గోధుమపిండిలో కొద్దిగా నెయ్యి కలిపి,తరువాత కొద్దిగా నీళ్లు జల్లుతూ పిండిని పొడి పొడి గా కలియబెట్టండి. ఈ పిండిని పది నిమిషాల పాటు తడి బట్టతో కప్పి వుంచండి.
2) తరువాత ఆ పిండిని గట్టిగా కలిపి పిడికిలికి సరిపడా పరిణామంలో చుట్టండి.వీటిని బాణలిలో సన్నటి మంట మీద మరుగుతున్న నెయ్యిలో ఎర్రగా ఫ్రై చేసి తీసి చల్లారబెట్టి పొడిగా దంచి,నూకల జల్లెడలో జల్లెడ పట్టి పక్కన వుంచండి.
3) ఇప్పుడు ఇలా చేసిన గోధుమ చుర్మాలో చక్కెర పొడి,యాలకుల పొడి,జీడిపప్పు,కిస్ మిస్ లను కలిపి ,కొంచెం తడి చేతితో కావాల్సిన పరిణామంలో లడ్డూలు గా చుట్టి గట్టిపడ్డాక ఆరగించండి......................

ఉల్లి గారెలు

కావాల్సినవి:
మినపప్పు- 500 గ్రా
ఉల్లిపాయలు- 250 గ్రా
అల్లం- చిన్న ముక్క
పచ్చి మిర్చి- పది
కరివేపాకు- పది రెబ్బలు
ఉప్పు-తగినంత
నూనె-వేయించడానికి సరిపడా


తయారు చేసే విధానం:
1) మినపప్పును కడిగి నానబెట్టండి. రెండు గంటలతరువాత దీన్ని గట్టిగా ఉండేలా గ్రైండ్ చేయండి.(అంటే పప్పు పలుకుగా ఉండాలి)తగినంత ఉప్పు కలపండి.గ్రైండ్ చేసే ముందు నీళ్లు ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
2 ) ఇప్పుడు తరిగిన అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ,ఉల్లిపాయముక్కలు,కరివేపాకు గ్రైండ్ చేసిన పిండిలో కలపండి.
3 ) ఈ పిండిని ముద్దలుగా చేసి తడిచేతి మీద పలుచగా అద్ది -బాణలిలో కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించండి. అంతే ఎంతో రుచికరం అయిన ఉల్లిగారెలు రెడీ..ఇవి కొబ్బరి చట్నీ తో తింటే చాలా బావుంటాయి....

పొంగలి పులావ్

కావాల్సినవి:
బాసుమతి బియ్యం- 500గ్రా
పెసరపప్పు- 200 గ్రా
నెయ్యి- 75 గ్రా
జీలకర్ర- 15 గ్రా
గరం మసాల- 5 గ్రా
పుదీనా- 2 కట్టలు
ఉల్లిపాయలు- 50 గ్రా
అల్లం-25 గ్రా
క్యారెట్- 100 గ్రా
బీన్స్- 100 గ్రా
బంగాళదుంపలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
పచ్చిమిర్చి- ఆరు
తయారు చేసే విధానం:
1) పెసరపప్పును రాళ్ళు లేకుండా శుభ్రం చేసి,బియ్యం తో కలిపి బాగా కడిగి నీళ్లు వడపోసి ఉంచండి.
2) తరువాత స్టవ్ మీదున్న గిన్నెలో నెయ్యి వేసి వేడిచేసాక జీలకర్ర,గరం మసాలాల్ని వేసి ఫ్రై చేయండి.తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసాక,పచ్చిమిర్చి,చిన్నగా తరిగిన అల్లం ముక్కలు,పుదీనా,ముక్కలుగా తరిగిన కూరగాయలు వేసి ఇంకా ఫ్రై చేసి దానిలో వడగట్టిన బియ్యం,పెసరపప్పుల్ని కలిపి దోరగా వేయించండి.
3) ఇప్పుడు అదే గిన్నెలో ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి,తగినంత ఉప్పు కలిపి మూత పెట్టి మూడొంతులు ఉడికాక,పులావును గరిటెతో ఒక సారి బాగా కలియబెట్టి సన్నటి మంట మీద పూర్తిగా ఉడికేవరకు ఉంచి,దించి, గ్రేవీతో వడ్డిస్తే బావుంటుంది.

వెజిటబుల్ పిన్ వీల్స్

కావాల్సినవి:
బ్రెడ్ స్లయిస్లు -ఆరు
బఠానీలు- 50 గ్రా
బంగాళదుంపలు - 50 గ్రా
ఉల్లిపాయలు-ఒకటి
పచ్చిమిర్చి-రెండు
పసుపు-చిటికెడు
వెన్న- 100 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 ) ఒక గిన్నెలో కొంచెం వెన్న వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించాక పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఆ తరువాత ఉడికించి,మెత్తగా చేసిన బంగాళాదుంపల గుజ్జును వేసి కలియబెడుతూ,ఉడికించిన బఠానీలు కూడా కలిపి,దానికి కొంచెం పసుపు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలిపి కూరను తయారు చేయండి.
2) తరువాత ఒక్కో బ్రెడ్ స్లయిస్ కు పక్క బాగాలు కోసి వాటి పైన తయారు చేసిన ఆలు కూరను పూసి బ్రెడ్ స్లయిస్ ను ఒక సైడ్ నుండి చాపలా చుట్టండి.ఇలా చుట్టిన బ్రెడ్ రోల్ విడిపోకుండా ఎడం ఎడంగా రెండు టూత్ పిక్స్ గుచ్చండి. ఆ తరువాత పుల్లకు పుల్లకు మద్య గా చాకు తో కొస్తే ఒక్కో చుట్ట రెండు ముక్కలుగా అవుతుంది.
3) ఇప్పుడు పెనం మీద వెన్న వేసి,స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద బ్రెడ్ రోల్ల్స్ ను కలియబెడుతూ ఎర్రగా ఫ్రై చేసి,టమోటా సాస్ తో ఆరగించండి.

చికెన్ క్రీమ్ స్టిక్స్

కావాల్సినవి:
చికెన్ (ఎముకలు లేనిది)- 250 గ్రా
వేరుసెనగ గుళ్ళు- 25 గ్రా
పెరుగు మీగడ- 30 గ్రా
నిమ్మకాయ- అర చెక్క
అల్లం-చిన్న ముక్క
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-నాలుగు
యాలకులు-మూడు
ఉప్పు-తగినంత
నూనె-రెండు టీ స్పూన్లు
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో ఎముకలు లేని చికెన్ ముక్కల్ని వేసి,వాటిని ఫ్రై చేసి ముద్ద గా నూరిన వేరుసెనగ గుళ్ళు,పెరుగుమీగడ,తురుమిన అల్లం,సన్నగా తరిగిన పచ్చిమిరపకాయముక్కలు,దంచిన యాలకులు,తగినంత ఉప్పు కలిపి ఒక గంట సేపు నానబెట్టండి.
2 ) తరువాత నానిన ఒక్కో చికెన్ ముక్కను సన్నని వెదురు పుల్లకు గుచ్చి బొగ్గుల వేడి మీదగాని,గ్రిల్లర్ లో గాని,గ్యాస్ మంట మీదగాని కాల్చి,వెజిటబుల్ సలాడ్,నిమ్మ చెక్కలతో అతిధులకు అందించండి.

Saturday, February 28, 2009

బెల్లం జిలేబి

కావాల్సినవి:
మైదా- 600 గ్రా
సోడా-అర టీ స్పూన్
పెరుగు-ఒక కప్పు
బెల్లం-1 1/4 కే జి
తయారు చేసే విధానం:
1 ) ఒక రోజు ముందు వంద గ్రాముల మైదాకి చిటికెడు సోడా,పెరుగుకలిపి మెత్తటి ముద్దలా కలియబెట్టండి.ఎనిమిది గంటల తరువాత-మిగిలిన ఐదువందల గ్రాముల మైదాపిండిలో ముందుగా పులియబెట్టిన పిండి,కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలిపి మళ్ళీ మెత్తటి ముద్దలా (అంటే చపాతీ పిండి కంటే జారుడుగా) చేసి పన్నెండు గంటలు నానబెట్టాలి.ఇలా చేస్తే పిండి బాగా పులుస్తుంది.
2 ) బెల్లాన్ని ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి పాకం తయారు చేయండి.పాకం లేతగా ఉండగానే దించండి.
3 ) ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి కాగిన తరువాత -పిండిని గట్టి జిలేబీ వస్త్రంలో పోసి-అన్ని వైపులనుండి మూసి మూటగా చేయండి. ఈ మూటను చేతితో పిండుతూ నూనెలో మూడు నాలుగు సార్లు జిలేబిల మాదిరి తిప్పండి.వేగిన పిదప వీటిని సిద్ధంగా ఉంచిన బెల్లం పాకంలో ముంచి తీస్తే తీయని రుచికరమైన జిలేబీలు సిద్ధం.
4 ) పద్నాలుగు అంగుళాల చతురస్రాకారంగా ఉన్నా గట్టి వస్త్రానికి మద్యలో చిన్న రంధ్రం చేయండి. దీన్ని దారంతో బటన్ కాజాకి కుట్టిన రీతిలో కుడితే జిలేబి వస్త్రం తయారవుతుంది. ........

Friday, February 27, 2009

ఎగ్ హల్వా

కావాల్సినవి:
పాలు- అర లీటరు
గుడ్లు-అర డజను
చక్కర - 150 గ్రా
జీడిపప్పు-20 గ్రా
బాదం పప్పు- 20 గ్రా
పిస్తా పప్పు-10 గ్రా
చాకొలేట్ పౌడర్-2 టేబుల్ స్పూన్లు
నెయ్యి- 100 గ్రా
వెనీలా ఎసెన్స్ -1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం:
1 ) ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసి అందులో చక్కెర పోసి కలియబెట్టాక, పాలు పోసి బాగా కలపండి.తరువాత అందులోనే చాకొలేట్ పౌడర్ ,జీడిపప్పు,బాదం,పిస్తా,పప్పులను కలిపి పక్కన వుంచండి. 2) తరువాత బాణలిలో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి కాచాక,సన్నటి మంట మీద ఉంచి-పాలు,కోడిగుడ్ల మిశ్రమాన్ని కొంచెంకొంచెం పోస్తూ కలియబెడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు గట్టిపడి హల్వా తయారవుతుంది.అది ఇంకా దగ్గరకు వచ్చాక ,దించి ,వెనీలా ఎసెన్స్ కలిపి ,డిష్ లోకి మార్చి అతిధులకు అందించాలి.

సునేరి భేండి

కావాల్సినవి:

బెండకాయలు- 250 గ్రా
సెనగపిండి- 50 గ్రా
కారం- అర టీ స్పూన్
చాట్ మసాలా- అర టీ స్పూన్
ఉప్పు-తగినంత

నూనె-ఫ్రై చేయడానికి సరిపడా

తయారు చేసే విధానం:

1 ) బెండకాయలను చాకుతో అడ్డంగా రెండు ముక్కలుగా కోసి మళ్లీ నిలువుగా రెండు ముక్కలుగా చీల్చండి.

2) ఈ ముక్కల్ని ఒక వెడల్పు గిన్నెలో వేసి-సెనగపిండి ,కారం,చాట్ మసాలా,తగినంత ఉప్పు,కలపండి.తరువాత కొంచెం నీళ్లు పోసి కలపండి.
3 ) ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాచాక-సెనగపిండి మిశ్రమంలో వున్న బెండకాయ ముక్కలను వేసి ఫ్రై చేసి తీస్తే సునేరి భేండి రెడీ... దీనికి వేయించిన జీడిపప్పు కూడా కలిపితే చాలా బావుంటుంది.

అన్నమయ్య లడ్డు

కావాల్సినవి:
సెనగ పిండి- 1కే జి
పంచదార- 1 కే జి 300 గ్రా
మిశ్రీ బిళ్ళలు- 100 గ్రా
యాలకుల పొడి- 15 గ్రా
జీడిపప్పు - 100 గ్రా
నెయ్యి-వేయించడానికి సరిపడా
కిస్ మిస్- 100గ్రా
తయారు చేసే విధానం:
1) సెనగపిండిని జల్లించి-బజ్జీల పిండిలా తయారు చేసి పక్కన వుంచండి.
2) చక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ పాకం తయారు చేయండి.(ఒకటిన్నర తీగల పాకం ఐతే చాలు)
3) బాణలిలో నెయ్యి పోసి కాగిన తరువాత-బూంది చట్రంలో సెనగపిండిని పోస్తూ బూంది తీయండి.బూంది మెత్తగా వేయించి పాకంలో వేస్తూ వుండాలి. పైన యాలకుల పొడి వేసి కలపండి.
4 ) పాకంలో వున్న బూంది నుండి సగం తీసి కొద్దిగా గ్రైండ్ చేయండి.దీన్ని మిగిలిన బూందిలో కలిపి -జీడిపప్పు,కిస్ మిస్,మిశ్రీ బిళ్ళలుకొంచెం కలిపి లడ్డూలుగా చుడితే -ఎంతో రుచిగా వుండే అన్నమయ్య లడ్డు తయార్..........

Tuesday, February 24, 2009

వెజ్ వడలు

కావాల్సినవి:
సెనగపప్పు- 50 గ్రా
మినపప్పు- 50 గ్రా
పెసరపప్పు-50 గ్రా
పచ్చిమిర్చి-పది
అల్లం-చిన్నముక్క
క్యాబేజీ -100 గ్రా
పచ్చి బఠానీ - 25 గ్రా
కాలీఫ్లవర్ -చిన్న ముక్క
ఉల్లిపాయలు-రెండు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు-తగినంత
నూనె-వేయించందానికి సరిపడా
తయారు చేసే విధానం:
1) సెనగపప్పు,మినపప్పు,పెసరపప్పులను కలిపి శుభ్రంగా కడగండి.వీటిని రెండుగంటల సేపు నానబెట్టండి.నీళ్లు వార్చి సగం పప్పును తీసుకుని రుబ్బండి.
2 ) మిగిలిన సగం పప్పులో అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు ,కూరగాయముక్కలు,పచ్చి బఠానీ ,కొత్తిమీర, కరివేపాకు కలపండి.ఈ మిశ్రమాన్ని రుబ్బిన పిండి లో కలుపుకోవాలి.ఆ పైన ఉప్పు చేర్చండి.
3 ) నూనె బాగా కాగిన తరువాత ఈ పిండిని వడలుగా చేసుకొని దోరగా వేయించండి.వెజ్ వడలు రెడీ........

ఆలు బైగన్ కర్రీ

కావాల్సినవి:
వంకాయలు- 250 గ్రా
బంగాళా దుంపలు- 250 గ్రా
ఉల్లిపాయలు-60 గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర పొడి-పావు టీ స్పూన్
ధనియాల పొడి-అర టీ స్పూన్
పసుపు-చిటికెడు
టమోటాలు-నాలుగు
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా

తయారు చేసే విధానం:
1) తెల్ల వంకాయలు,బంగాల దుంపలను ముక్కలు గా తరిగి ఉప్పు నీటిలో వేయండి.
2 ) ఒక గిన్నెలో నూనె పోసి కాచాక-సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని సన్నటి సెగమీద వేయించండి.ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద ,కారం,ధనియాలు,జీలకర్ర పొడి తో పాటు పసుపు వేసి కాయగూరముక్కల్ని కూడా కలిపి వేయించండి.ముక్కల్లో నీరు ఇంకిపోతే గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించండి.
3) కూర ఉడికిన తరువాత టమోటాలని ,తరిగిన కొత్తిమీర వేసి కాసేపు ఉడికించి తరువాత దించాలి.దీనిని రైస్ తో వడ్డిస్తే బావుంటుంది.

అటుకుల దోశ

కావాల్సినవి:
బియ్యం-2 కప్పులు
అటుకులు- అర కప్పు
చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు
మెంతులు-ఒక టీ స్పూన్
వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్
నూనె -తగినంత
తయారు చేసే విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంచేసుకోవాలి.తులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక రెండు గంటలు పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాలాక తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ... ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ పప్పుచట్నీ తో కూడా బావుంటాయి.

Monday, February 23, 2009

చాంద్ బిస్కట్స్

కావాల్సినవి:
మైదా - 500 గ్రా
పంచదార పొడి-పావు కేజి
యాలకులు- 3గ్రాAdd Video
వనస్పతి -పావు కేజీ
తయారు చేసే విధానం:
1) మైదాను జల్లించండి.మద్యలో గొయ్యిలా చేసి ,వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యేవరకు ఉంచండి.పిదప పంచదార పొడి చేర్చండి.ఇందులో కొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి.
2 )మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దన చేసి పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారు అవుతుంది.పైన యాలకుల పొడి కలపండి.
3 ) ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్నా చపాతీలా చేయండి. పదును ఉన్నా గ్లాస్ తో ఆ చపాతి గట్టిగా అద్దితే బిస్కట్లు రూపొందుతాయి.వీటిని ఒక ట్రేలో అమర్చి నూట ఎనభయి డిగ్రీల దగ్గర ఇరవయ్ నిమిషాలు బెక్ చేయండి .చాంద్ బిస్కట్స్ రెడీ....చల్లారిన తరువాత ఆరగించండి.

Friday, February 20, 2009

సమోసా చికెన్ కర్రీ

కావాల్సినవి:
చికెన్ బ్రెస్ట్ పీస్లు -రెండు
పనీర్-50 గ్రా
జీడిపప్పు- 20 గ్రా
కొత్తిమీర-ఒక కట్ట
పచ్చి మిర్చి-మూడు
నిమ్మకాయ-ఒకటి
నూనె-వేయించడానికి సరిపడా
గ్రేవీ తయారీకి:
గసగసాలు- 25 గ్రా
జీడిపప్పు- 25 గ్రా
కారం-ఒకటిన్న టీ స్పూన్
అల్లంవెల్లుల్లి-ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు- 50 గ్రా
పెరుగు- 100 గ్రా
గరం మసాల- 1గ్రా
పచ్చి మిర్చి-రెండు
టమోటాలు- 100 గ్రా
ఉప్పు-తగినంత
నూనె- 50 గ్రా
పసుపు-చిటికెడు
తయారు చేసే విధానం:
1 )ముందుగా ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేయించండి.తరువాత అందులో అల్లంవెల్లుల్లి ముద్ద,కారంపసుపు,రుబ్బిన మసాలముద్దను చేర్చి వేయించండి.ఆ తరువాత దానిలో పెరుగు,టమోటాముక్కలు ,పచ్చిమిర్చి వేసి మరిగిస్తే గ్రేవీ రెడీ అవుతుంది.
2)తురిమిన పనీర్ లో జీడిపప్పు,కొత్తిమీర,పచ్చి మిర్చి ,నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి.
3 )చికెన్ బ్రెస్ట్ పీస్లను ఆకు ఆకారం లో రెక్క జాయింట్ దగ్గర కోసి చేతితో లాగితే ఎముక మిగిలి చర్మం విడిపోతుంది.
4)ఈ చర్మంలో -పైన తయారు చేసిన మిశ్రమాన్ని కూరి ,సమోసా ఆకారంలో చికెన్ పీస్ ను మదచండి.చివరలు విడిపోకుండా దారం తో కట్టి-వాటిని బాణలిలో మరుగుతున్న నూనె లో వేయించి తీయండి.
5)ఇలా తయారైన సమోసాలను పైన సిద్ధం చేసిన గ్రేవీలో వేసి,పైన కొత్తిమీర జల్లి అతిధులకు అందించండి.

Thursday, February 12, 2009

పాలకూర పకోడీ

కావాల్సినవి:
పాలకూర-పది కట్టలు
సెనగపిండి-200 గ్రా
కారం పొడి-ఒక టీ స్పూన్
వంట సోడా-పావు టీ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
పసుపు-చిటికెడు

తయారు చేసే విధానం:

1)ముందు గా పాలకూర కాడలను తుంచాలి.ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి ఉంచండి .
2 )ఇప్పుడు సెనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నె లో జల్లించి దానికి తగినంత ఉప్పు,కారం,పసుపు,వంటసోడా కలిపి,నీళ్ళతో జారుడుగా బజ్జీల పిండిలా కలపండి.ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కలిపి బాణలిలో ఎర్రగా వేయించి,ప్లేట్లలో అమర్చి అతిధులకు అందించండి.





Monday, February 2, 2009

వెజ్ నేచురల్

కావలసినవి :
కేరేట్స్- 100గ్రా
బీన్సు- 100 గ్రా
ఆనపకాయ-ఒక ముక్క
టమోటాలు-రెండు
ఆవాలు- పావు టీ స్పూన్
జీలకర్ర-పావు టీ స్పూన్
పచ్చి మిర్చి-ఆరు
పసుపు-పావు టీ స్పూన్
గోధుమపిండి-3 టీ స్పూన్లు
కొత్తిమీర-ఒక కట్ట
నూనె-2 టీ స్పూన్లు
ఉప్పు- తగినంత
కరివేపాకు-కొంచెం
తయారు చేసే విధానం:
1)కూరగాయలన్నీ ముక్కలు గా కోసి ఉంచుకోవాలి.
2 )ఒక గిన్నెలో నూనె పోసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకుతో తాలింపు ఇవ్వండి.అందులో పచ్చిమిర్చి, గోధుమ పిండి,పసుపు చేర్చి కొద్ది సేపు వేయించాలి.
3)ఆ పైన కాయగూరముక్కలు (టమోటా ముక్కలు తప్ప),ఒకటిన్న గ్లాసులనీళ్లు పోసి సన్నటి మంట మీద ఉడికించండి.అవి కొంచెం ఉడికాక టమోటా ముక్కలు వేసి అవి కొంచెం మగ్గాక ,ఉప్పు ,కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాల తరువాత దించండి.అంతే వెజ్ నేచురల్ రెడీ...

Sunday, February 1, 2009

రవ్వ కజ్జికాయలు

కావాల్సినవి:
మైదా పిండి-అర కేజీ
నెయ్యి- 50 గ్రా
ఉప్పు-చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
పూర్ణం కోసం
నెయ్యి - 50 గ్రాb
బొంబాయి రవ్వ- 300 గ్రా
పంచదార- 400 గ్రా
కొబ్బరి తురుము- 100 గ్రా
యాలకులు- 5గ్రా
తయారు చేసే విధానం:
1) బొంబాయి రవ్వ,నెయ్యి కలిపి దొర గా వేయించి,అందులో పంచదార పొడి,వేయించిన కొబ్బరి తురుము,యాలకుల పొడి కలిపి పక్కన వుంచండి.
2)మైదాను జల్లించి -ఉప్పు,నెయ్యి కలపండి.దీన్ని నీళ్ళతో తడిపి గట్టి ముద్దలా చేసి పది నిమిషాలు సేపు వస్త్రాన్ని కప్పండి.తరువాత చిన్న చిన్న ఉండలు గా చేసి పూరీలు వత్తండి.దీని మద్య లో రెండు చెంచాల పూర్ణం మిశ్రమాన్ని ఉంచి రెండు అంచులూ దగ్గరకు చేర్చి గోరంచుగా మడత పెట్టండి.ఇలా చేసిన వాటిని నూనె లో దొరగా వేయిస్తే రవ్వ కజ్జికాయలు సిద్ధం...

Saturday, January 31, 2009

చికెన్ లాలీపాప్

కావాల్సినవి:
చికెన్ రెక్కలు-ఎనిమిది
ఎండుమిర్చి-నాలుగు
అల్లంవెల్లుల్లి-అర టీ స్పూన్
గరం మసాలా-చిటికెడు
కోడి గుడ్డు సొన- 2టీ స్పూన్లు
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉప్పు-తగినంత
నిమ్మరసం-ఒక టీ స్పూన్
ఆరెంజ్ కలర్ -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం :
1)ముందుగా ఒక చికెన్ రెక్కను తీసుకుని దాన్ని వెనక్కి తిప్పి-జాయింట్ మద్య లో విరవండి.ఇలా చేయడం వల్ల,రెండు ఎముకల చివర్లు బయటకు వస్తాయి.వాటిలోనుండి సన్నటి ఎముకల్ని బయటకు లాగి తీసేయండి.చివరకు పెద్ద ఎముక మిగులుతుంది.దాన్ని పట్టి వున్న మాంసాన్ని ముద్దలా చేసి-ఎముక చివరకు చేర్చండి.ఇలా మిగిలిన చికెన్ రెక్కల్ని లాలీపాప్ ల మాదిరిగా సిదం చేసుకోండి.
2)ఈ ఎముకలను పట్టిన మాంసానికి పైన చెప్పిన మసాలాల్ని పట్టించి అరగంట సేపు ఉంచండి.
3)బాణలి లో మరుగుతున్న నూనె లో వీటిని ఎర్ర గా వేయించండి.తయారైన చికెన్ లాలిపాప్ లను అతిధులకు వేడి వేడి స్నాక్స్ గా అందించండి........

Friday, January 30, 2009

చీజ్ బాల్స్

కావాల్సినవి:
బంగాళా దుంపలు-పావు కేజి
నిమ్మకాయ-ఒకటి
మిరియాలపొడి-అర టీ స్పూన్
చీజ్- 150 గ్రా
మీగడ-50మీ.లీ
కోడిగుడ్డు-ఒకటి
బ్రెడ్ పొడి-అర కప్పు
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బంగాళా దుంపల్ని మెత్తగా ఉడికించి మెదిపి ముద్దగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
2)ఈ ముద్దలో ఉప్పు,మిరియాల పొడి,నిమ్మ రసం కలిపి వుంచుకోవాలి.
3)చీజ్ ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలు గా చేయాలి.
4)ఒక్కో ఉండకు బంగాళా దుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి.
5)కోడిగుడ్డును పగులగొట్టి సొనను బాగా గిలకొట్టాలి.ఇప్పుడు ఈ ఉండాలని సోనలో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.వేడి వేడి చీజ్ బాల్స్ రెడీ..ఇవి సాస్ తో తింటే బావుంటాయి....

వాక్కాయ కొబ్బరి పచ్చడి

కావలసినవి:
వాక్కాయలు- 100 గ్రా
పచ్చిమిర్చి-పది
వాలు-1 టీ స్పూన్
జీలకర్ర- 1టీ స్పూన్
పచ్చి కొబ్బరి-ఒకటి
నూనె-3 టీ స్పూన్లు
పసుపు-1/2టీ స్పూన్
మినపప్పు -1 టీ స్పూన్
సెనగ పప్పు- 1టీ స్పూన్
ఎండుమిర్చి-మూడు
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1)వాక్కాయలను చాకుతో కోసి మద్య లో గింజలను తీసేయండి.
2)తరువాత బాణలి లో ఒక చెంచా నూనె పోసి కాచాక ,అందులో కొంచెం ఆవాలు,జీలకర్ర వేసి ఫ్రై చేసాక అందులోనే పచ్చి మిరపకాయలు వేసి దించి,దానికి కొబ్బరి ముక్కలు,పసుపు,గింజలు తీసిన వాక్కాయలు,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
3)ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడికి మిగిలిన ఆవాలు,జీలకర్ర,సెనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చిలతో తాలింపు ఇచ్చి బాగా కలియబెట్టి రైస్ తో వడ్డించండి.........

బగారా అండా కర్రీ

కావాల్సినవి:
గుడ్లు-నాలుగు
నువ్వులు-25 గ్రా
వేరుసెనగ పప్పు- 25 గ్రా
ధనియాల పొడి- 1టీ స్పూన్
కొబ్బరి-30 గ్రా
చింత పండు-30 గ్రా
కరివేపాకు- 4రెబ్బలు
కారం- 10గ్రా
ఆవాలు-చిటికెడు
ఎండుమిర్చి-మూడు
మెంతులు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- 60 గ్రా
తయారు చేసే విధానం:
1)గుడ్లను పావు గంట సేపు ఉడికించి,దించి పెంకు ఒలిచి చాకుతో గాట్లు పెట్టండి.
2)ఒక గిన్నెలో నూనె పోసి కాచాక -ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి,కరివేపాకుతో తాలింపు పెట్టండి.
3 )ఆ తరువాత నువ్వులు,వేరుసెనగపప్పు,కొబ్బరి,వేయించి మెత్త గా నూరి మసాలా ముద్దను తయారు చేయండి.
4)ఇప్పుడు ఈ మసాలాను తాలింపు లో వేసి,కొంచెం సేపు వేయించండి.నూనె ఆ ముద్ద నుండి విడిపోతున్నప్పుడు కారం,పసుపు వేసి కలిపాక-చింత పండు పులుసు పోసి ఉడికించండి.తరువాత తగినంత ఉప్పు కలిపి గ్రేవీలా తయారయ్యాక ఉడకబెట్టిన గుడ్లను వేసి ,కాసేపు ఉడికిస్తే బగారా అండా కర్రీ రెడీ.... ఇది రైస్ తో వడ్డిస్తే బావుంటుంది......

Wednesday, January 28, 2009

మాంగో కా మీటా

కావాల్సినవి:
బ్రెడ్ పీసెస్ - 8
పంచదార- 300 గ్రా
మామిడి పండ్ల రసం-1 గ్లాస్
పాలు- 250 మీ.లీ
జీడిపప్పు- 20 గ్రా
పిస్తా పప్పు- 20 గ్రా
నెయ్యి -ఫ్రై చేయడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1 )బ్రెడ్ ముక్కల అంచులు తీసేసి చిన్నచిన్న ముక్కలుగా చేయండి.
2 )తరువాత ఒక భానలిలో నెయ్యి వేసి కాచాక-బ్రెడ్ ముక్కల్ని వేయించి,పాలు పోసి సన్నని మంట మీద పెట్టి పాలు ఇంకి పోయేవరకు గరిట తో కలుపుతూ వుండాలి.
3 )తరువాత ఈ బ్రెడ్ మిశ్రమం మీద పంచదార,మామిడిపండ్ల రసం,ఒక కప్ నీళ్లు పోసి గరిటతో నెమ్మది కలపాలి.
4)పంచదార కరిగి బ్రెడ్ మిశ్రమంలో ఇంకి మరీ గుజ్జు గా కాకముందే దించేయండి.ఆ తరువాత జీడిపప్పు,పిస్తా పప్పు వేస్తె మాంగో కా మీటా రెడీ... దీని పైన చేర్రీస్ తో కూడా అలంకరిస్తే చాలా బావుంటుంది................

మాటర్ కోఫ్తా కర్రీ

కావలసినవి-
పచ్చి బఠానీ -పావు కేజి
సెనగపిండి- 2టీ స్పూన్లు
ఉల్లిపాయలు - 50 గ్రా
పచ్చి మిర్చి-నాలుగు
ఉప్పు-తగినంత
కారం-1 టీ స్పూన్
ధనియాల పొడి-1 టీ స్పూన్
గరం మసాలా- 1/4 టీ స్పూన్
పసుపు- 1/2 టీ స్పూన్
బంగాల దుంపలు-100 గ్రా
నూనె- 50 గ్రా
తయారుచేసే విధానం:
1)పచ్చి బఠానీలు ఉడికించి,మిక్సీలో గ్రైండ్ చేయండి.
2 )ఒక పాన్ లో నూనె వేసి కొన్ని ఉల్లిపాయముక్కల్ని వేయించండి.ఇందులో పచ్చిమిర్చి ముక్కలు,సెనగపిండి వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.ఆ పైన బఠానీ పేస్ట్ వేసి కలిపి ముద్దలుగా (కోఫ్తాలు) చేసి నూనెలో వేయించండి.
3 )ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించి,అందులో కారం,ధనియాల పొడి,పసుపు వేసాక-బంగాళా దుంప ముక్కలు కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించండి.గ్రేవి పూర్తిగా ఉడికాక,ఉప్పు వేయండి.ఇందులో ముందు గా వేయించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు ఉడికిస్తే మాటర్ కోఫ్తా కర్రీ సిద్ధం......

Tuesday, January 27, 2009

బంజారా మటన్

కావాల్సినవి:
మటన్- 500 గ్రా
టమోటాలు- 150 గ్రా
ఉల్లిపాయలు-50 గ్రా
నూనె- 50 గ్రా
గరం మసాలా- 2గ్రా
పచ్చిమిర్చి-నాలుగు
అల్లం-చిన్న ముక్క
ధనియాలు-2 టీ స్పూన్లు
ఎండుమిర్చి-మూడు
ఎండు మెంతి కూర-ఒక టీ స్పూన్
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 )మటన్ ని శుభ్రంగా కడిగి-గిన్నెలో వేసి కొంచెం ఉప్పు,గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి.
2)ఒక గిన్నె లో నూనె పోసి కాచాక -సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని ఎర్ర గా వేయించండి.తరువాత పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి.తరువాత దంచిన ధనియాలు,ఎండుమిర్చి కలిపి ,ఉడికించిన మాంసాన్ని కూడా వేయండి.
3)ఈ మిశ్రమంలో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవి పూర్తిగా ఉడికే వరకూ ఉంచి ఉప్పు సరి చూడండి.ఇప్పుడు దానిమీద ఎండు మెంతి కూర జల్లితే బంజారా మటన్ రెడీ.....

రిబ్బన్ పకోడీ

కావాల్సినవి:
సెనగపిండి- 400 గ్రా
బియ్యప్పిండి- 100 గ్రా
కొత్తిమీర- 4కట్టలు
పచ్చి మిర్చి-ఐదు
ఉప్పు-తగినంత
జీలకర్ర పొడి- 1టీ స్పూన్
కారం- 1టీ స్పూన్
నెయ్యి- 50గ్రా
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1)సెనగపిండి,బియ్యప్పిండి కలిపి జల్లించండి.ఇందులో ఉప్పు,సన్నగా తరిగిన కొత్తి మీర,పచ్చిమిర్చి,జీలకర్రపొడి,కారం కలపండి.
2 )తరువాత వేడి చేసిన నెయ్యిని పిండి లో పోసి కలియబెట్టండి.తరువాత ఇందులో నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయండి.
3 )జంతికల గొట్టం లో రిబ్బన్ ఆకారంలో వచ్చే అచ్చును ఉంచి,ముందుగా కలిపిన పిండిని పెట్టి-వేడి నూనెలో వత్తి ఎర్రగా వేయించండి.నోరూరించే రిబ్బన్ పకోడీ రెడీ..........

Monday, January 26, 2009

కొబ్బరి కేక్

కావాల్సినవి:
మైదా- 30 గ్రా
కొబ్బరి-సగం చెక్క
పంచదార 20గ్రా
గుడ్లు-రెండు
పాలు-అర కప్పు
వెన్న- 20 గ్రా
చేర్రీస్-ఐదు
బేకింగ్ పౌడర్-పావు టీ స్పూన్

తయారు చేసే విధానం :
1 ) ఒక గిన్నెలో వెన్న ,పంచదారపొడి కలియబెట్టి మిశ్రమం లా తయారు చేయండి.ఇందులో పాలు,జల్లించిన మైదా,బేకింగ్ పౌడర్,బీట్ చేసిన గుడ్ల మిశ్రమాన్ని కలపండి.
2)ఆ పైన తురిమిన కొబ్బరి వేసి ,కలపండి.
3)కప్పులకు వెన్నగాని ,నెయ్యి గాని పూసి కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని పోయండి.దీని పైన చేర్రీస్ పెట్టండి.వీటిని ఓవెన్ లో నూటఎనభయి డిగ్రీల దగ్గర ఇరవై నిముషాలు కుక్ చేయండి.
4 )ఓవెన్ లేకపోతే కుక్కేర్ లో ఇసుక పోసి ,దాని పైన కప్పుల్ని ఉంచి-గాస్ కట్ లేకుండా మూత పెట్టి స్టవ్ మీద అరగంట సేపు కుక్ చేస్తే కొబ్బరి కేక్ రెడీ..........

గోబీ టకాటిన్

కావలసినవి:
కాలి ఫ్లవర్ -రెండు
జీలకర్ర పొడి-ఒకటిన్నర టీ స్పూన్లు
ధనియాలపొడి- 2టీ స్పూన్లు
టమోటాలు-పావు కేజీ
అల్లంవెల్లుల్లి- 2టీ స్పూన్లు
ఎండుమెంతికూరపొడి -ఒక టీ స్పూన్
కారం-ఒకటిన్న టీ స్పూన్లు
నెయ్యి- 50 గ్రా
ఉప్పు-తగినంత
కొత్తి మీర- 1కట్ట
తయారు చేసే విధానం:
1)కాలి ఫ్లవర్ ను ముక్కలు గా తుంచి నీటిలో వేసి ఉప్పు కలిపి మెత్త బడే వరకు ఉడికించండి.
2)స్టవ్ మీద పెనం ఉంచి -దాని అంచున ఉడికించిన కాలి ఫ్లవర్ ముక్కలు,టమోటా ముక్కలు అమర్చండి .
3)పెనం మద్య లో నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చేయండి.కొన్ని నిమిషాల తరువాత కాలి ఫ్లవర్ ముక్కల్ని మద్య లోకి తీసుకువచ్చి ఫ్రై చేయండి.తరువాత టమోటా ముక్కలు,ధనియాల పొడి,గరం మసాల,జీలకర్ర పొడి,ఉప్పు వేసి-అట్ల కాద తో చిన్న చిన్న ముక్కలు గా కొడుతూ బాగా దగ్గరగా చేయండి.
4)ఫ్రై చేసిన ముక్కలు దగ్గర అవ్వగానే ఎండు మెంతికూర పొడి,కొత్తి మీర జల్లితే గోబీ టకా టిన్ రెడీ...వేడి వేడి ఈ వంటకం స్నాక్ లా కూడా అతిధులకు అందించవచ్చు. గోబీ టకా టిన్ మీద ఉల్లిపాయ ముక్కలు,ఉడికించిన బఠానీ కూడా వేసి సర్వ్ చేయవచ్చు...............

చెట్టినాడు చికెన్

కావలసినవి:
చికెన్- 500 గ్రా
మిరియాలు-15 గ్రా
కొత్తి మీర -2 కట్టలు
గరం మసాలా- 5గ్రా
అల్లం వెల్లుల్లి- 4టీ స్పూన్లు
నూనె- 50మీ.లీ
నిమ్మకాయ-ఒకటి
ఉల్లిపాయలు- 100 గ్రా
టమోటాలు- 100 గ్రా
పెరుగు-ఒక కప్పు
ఉప్పు-తగినంత
కారం-2 టీ స్పూన్స్
కరివేపాకు-ఒక కట్ట
తయారు చేసే విధానం:
1 )చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.తరువాత అందులో దంచిన మిరియాలపొడి ,పెరుగు,కొంచెం అల్లంవెల్లుల్లిముద్ద,నిమ్మకాయరసం,తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి.
2 )తరువాత స్టవ్ మీద ఉంచిన గిన్నెలో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక ,మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్దను ,కారం.టమోటాముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
3)ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి,కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.చికెన్ ఉడక గానే గరంమసాలా పొడి,కొత్తి మీరా ,కరివేపాకు వేసి,దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి..........




Saturday, January 24, 2009

సాగో పకోడా

కావాల్సినవి:
సగ్గు బియ్యం-50 గ్రా
బియ్యప్పిండి- 100 గ్రా
పెరుగు -50 గ్రా
మైదా-50 గ్రా
కారం-అర టీ స్పూన్
ఉల్లిపాయలు-రెండు
పచ్చి మిర్చి-ఆరు
కరివేపాకు-ఒక కట్ట
ఉప్పు -తగినంత
కొత్తిమీర-ఒక కట్ట
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1)సగ్గు బియ్యాన్ని ఐదు గంటల సేపు పెరుగులో నానబెట్టాలి.
2 )ఇందులో బియ్యప్పిండి,మైదా,కారం,సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు,ఉప్పు,కరివేపాకు,కొత్తిమీర కలపండి. అవసరమనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా చేర్చవచ్చు.
3 )కాగిన నూనెలో ఈ ముద్దను పకోడిలా వేయండి.గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత తీస్తే వేడి వేడి సాగో పకోడా రెడీ............

Friday, January 23, 2009

పైనాపిల్ హల్వా

కావలసినవి:
అనాసపండ్లు -రెండు
నెయ్యి - 100 గ్రా
బొంబాయి రవ్వ-50 గ్రా
జీడి పప్పు- 20 గ్రా
లెమన్ ఎల్లోకలర్ -చిటికెడు
పంచదార - 250 గ్రా
తయారు చేసే విధానం :
1)అనాసపండ్లను చాకు తో చెక్కు తీసి ,ముక్కలుగా కోసి,మెత్త గా గ్రైండ్ చేయండి.
2 )తరువాత ఒక గిన్నెలో నెయ్యి పోసి వేడి చేసాక -గ్రైండ్ చేసిన పైనాపిల్ గుజ్జును వేసి కొంచెం ఫ్రై చేసి ,ఆ తరువాత పంచదార పోయండి.
3 )ఇప్పుడు పంచదార కరిగి పాకం అయ్యి దగ్గర అవుతుండగా ముందే నీటిలో నానబెట్టిన రవ్వను కలిపి పూర్తిగా ఉడికించండి.
4)దించే ముందు లెమన్ఎల్లో కలర్ ,జీడి పప్పు వేసి కలియబెట్టి వేడిగా ఆరగించండి.....

పనీర్ చిల్లి ఫ్రై

కావాల్సినవి:
పనీర్- 200 గ్రా
కార్న్ ఫ్లోర్ -50 గ్రా
మైదా - 30 గ్రా
అల్లం వెల్లుల్లి -5 గ్రా
మిరియాల పొడి-చిటికెడు
పచ్చి మిర్చి - 50 గ్రా
వెల్లుల్లి- 25 గ్రా
సోయా సాస్-10 గ్రా
చైనా సాల్ట్ -3 గ్రా
కొత్తి మీర్ - 2కట్టలు
నూనె-ఫ్రై చేయడానికి సరిపడా
ఉప్పు-తగినంత
తయారు చేసే విధానం:
1 )పనీర్ ను కొంచెం పెద్ద ముక్కలు గా కట్ చేసి వుంచండి.
2 )తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో కార్న్ ఫ్లోర్ ,మైదా పిండిలను కలిపి,ఆ మిశ్రమానికి అల్లం వెల్లుల్లి ముద్ద,మిరియాల పొడి ,తగినంత ఉప్పు,కొంచెం నీళ్లు కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి పనీర్ ముక్కల్ని ముంచి బాణలి లో కాగుతున్న నూనె లో బాగా ఫ్రై చేసి తీసుంచండి.
3 )తరువాత ఒక గిన్నెను స్టవ్ మీదుంచి,నూనె పోసి కాగాక ,ముందుగా సన్నని చిన్నగా తరిగిన వెల్లుల్లిముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసాక,పచ్చి మిర్చి చీలికలను కూడా వేసి ఫ్రై చేయండి.
4 )ఇప్పుడు పనీర్ బజ్జీలను కలిపి కలియబెడుతూ ,దానిలో సోయా సాస్,చైనా సాల్ట్,సన్నగా తరిగిన కొత్తిమీర ,తగినంత ఉప్పు చేర్చి ఫ్రై చేయండి.
5)తరువాత ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను అర కప్పు నీళ్ళలో కలిపి పనీర్ చిల్లి ఫ్రై మీద పోస్తూ కలియబెడుతూ,పొడి గా అయ్యేంత వరకూ ఫ్రై చేసి దించి,ఫ్రైడ్ రైస్ తో గాని,పరోటా తో గాని సర్వ్ చేయాలి..............



అధ్రక్-కి -జింగా

కావాల్సినవి :
రొయ్యలు- 500 గ్రా
ఉల్లిపాయలు- 150 గ్రా
పచ్చి మిర్చి-ఆరు
అల్లం- 30 గ్రా
వెల్లుల్లి- 15 గ్రా
కారం- ఒకటిన్నర టీ స్పూన్
సోయా సాస్-2 టీ స్పూన్స్
అజినమోతో - 1 టీ స్పూన్
మిరియాల పొడి -పావు టీ స్పూన్
నూనె- 75 గ్రా
ఉప్పు-తగినంత
రెడ్ ఆరెంజ్ కలర్-చిటికెడు

తయారు చేసే విధానం:
1)ఒక్కో ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కోసి ,ఉప్పు కలిపిన నీటిలో పది నిమిషాల పాటు ఉడికించండి.పిదప నీళ్లు వార్చి ముక్కల్ని చల్లబర్చండి.
2 )ఈ ముక్కల్ని పచ్చిమిరపకాయలు కలిపి ముద్ద గా నూరండి.అలాగే అల్లం,వెల్లుల్లి ముక్కల్ని ముద్ద గా నూరండి.
3 )బాణలిలో నూనె పోసి వేడి చేసాక శుభ్రం చేసిన రొయ్యలు వేసి వేయించండి.వీటిని తీసేసిన పిమ్మట ఉల్లిపాయ ముద్ద వేసి ఎర్రగా ఫ్రై చేయండి.
4)ఇందులో అల్లం-వెల్లుల్లి ముద్ద ,కారం,మిరియాలపొడి ,రెడ్ ఆరెంజ్ కలర్ కలిపి ఐదు నిమిషాలు వేయించండి.ఆ పైన రొయ్యలు ,ఉప్పు వేసి కలియబెట్టండి.కూర కాస్త దగ్గర పడిన తరువాత అజినమోతో ,సోయాసాస్ లను చేర్చండి. ఐదు నిమిషాలు అయ్యాక అధ్రక్ కి జింగాను దించండి......

Thursday, January 22, 2009

మినీ స్ప్ర్రింగ్ రోల్స్



కావలసినవి :
మైదా - 250 గ్రా
గుడ్లు -ఒకటి
ఉప్పు-తగినంత
పాలు- 100 మీ.లీ
ఉల్లిపాయలు - 100 గ్రా
కాప్సికం - 100 గ్రా
సోయా సాస్ - టేబుల్ స్పూన్
చిల్లి సాస్ - టేబుల్ స్పూన్
అజినమోతో -చిటికెడు
నూనె-వేయించడానికి సరిపడా

తయారు చేసీ విధానం :
1 )మైదా పిండి లో కోడి గుడ్లు ,పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయండి .
2)ఒక పాన్ ను తీసుకుని వేడి చేయాలి. తరువాత బయటకుతీసి దాన్ని బయటకు తీసి ,గరిటెడు పిండి పోసి,చుట్టూ తిప్పి పలుచటి చిన్న పాన్ కేకు మాదిరిగా వేయండి.తరువాత మళ్ళీ పాన్ ను పొయ్యి మీద ఉంచండి. ఈ కేకును టేబుల్ మీద చపాతిలా పరచండి.
3)ఒక పాన్ లో కొంచెం నూనె పోసి,ముందుగా ఉల్లిపాయ,కాప్సికం ముక్కలు వేసి వేయించండి.అందులో కొంచెం సోయా సాస్,చిల్లి సాస్,అజినామోతో ,తగినంత ఉప్పు వేసి పొడి కూర తయారు చేయండి.ఆ పైన, ఈ పొడి కూరను పాన్ కేకుల మీద పెట్టి ,ఒక్కో కేకు ను ,కొంచెం మడత పెట్టి కప్పి,ముందు నుంచి చాపలా చుట్టి గుడ్డు సోనతో అతికించి ,వేడినూనె లో ఫ్రై చేయండి.మినీ స్ప్ర్రింగ్ రోల్ల్స్ రెడీ ... వీటిని టమోటా సాస్ తో సర్వ్ చేయాలి........








దేవి ప్రసాదం

కావలసినవి:
గోధుమ రవ్వ - 250 గ్రా
బెల్లం -350 గ్రా
నెయ్యి - 100 గ్రా
యాలకులు-5 గ్రా
జీడి పప్పు - 25 గ్రా
కిస్ మిస్ - 25 గ్రా
పచ్చి కోవా - 50 గ్రా
తయారు చేసే విధానం :
1)ముందు గా సన్నని గోధుమ రవ్వను ,జీడిపప్పు ,కిస్ మిస్ లను కలిపి ఒక గిన్నె లో వేయండి.ఆ తరువాత యాభయ్ గ్రాముల నెయ్యి ని చేర్చి గోధుమ నూక ను ఎర్రగా వేయించండి.
2 ) ఆ తరువాత ఆ నూక లో రెండున్నగ్లాసుల నీళ్లు పోసి బాగా కలియబెట్టి గిన్నె మీద మూత పెట్టి నూకను ఉడికించండి.
3 )గిన్నె లో నీళ్లు ఇంకిపోయిన తరువాత ముందు గానే తయారు చేసిన బెల్లం పాకాన్నివేసి ,సన్నని మంట మీద కలుపుతూ నూక ను ఉడికించండి.
4 )ఇప్పుడు బెల్లం పాకం,రవ్వలో బాగా ఇంకి ముద్ద గా తయారయ్యాక గ్ర పొడి,మిగిలిన నెయ్యి,ఎయ్యిచ్చి కోవాలు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాక దించి ,అతిధులకు అందించండి........

Wednesday, January 21, 2009

షాహీ మాటర్ పనీర్

కావలసినవి:
పనీర్ - 200 గ్రా
పచ్చి కోవా - 50 గ్రా
పచ్చి బఠానీలు -75 గ్రా
అల్లం-ఒక ముక్క
పచ్చి మిర్చి-ఐదూ
కోతి మీర -ఒక కట్ట
ఉల్లి పాయలు - 50గ్రా
జీడి పప్పు -20 గ్రా
గసగసాలు- 20 గ్రా
పెరుగు -అర కప్పు
కారం-అర టీస్పూన్
ఉప్పు-తగినంత
నూనె - 75 గ్రా
తయారు చేసీ విధానం
1)ఒక గిన్నెలో నూనె వేడి చేసి,ముక్కలు గా తరిగిన పనీర్ ను ఎర్రగా వేయించి తీసి ఉప్పు నీటి లో నానబెట్టండి.
2)అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాక,తురిమిన అల్లం,పచ్చి మిర్చిలను ,కారం,ముద్ద గా నూరిన జీడిపప్పు, గసగసాలమిశ్రమాన్ని కొంచెం ఫ్రై చేసి పెరుగును కలపండి.అవసరం ఐతే కొంచెం నీళ్లు పోసి గ్రేవి లా మరిగించండి.దీంట్లో పనీర్ ముక్కలు ,పచ్చి కోవా ,ఉడికించిన పచ్చి బటానీలు ,గరం మసాల వేసి ఉప్పు సరి చూసుకోండి. తయారైనా షాహీమాటర్ పనీర్ మీద కోతిమీర జల్లి వేడి వేడి పరోటాలతో వడ్డించండి ......

Tuesday, January 6, 2009

చికెన్ పెరిపెరి

కావాల్సినవి
చికెన్- 500గ్రా
మిరియాలు -అర టీస్పూన్
ఎండు మిర్చి - 20 గ్రా
అల్లం వెల్లుల్లి -ఒకటిన్నర టీ స్పూన్
జీలకర్ర -అర టీ స్పూన్
వెనిగర్ -అర కప్పు
దాల్చిన చెక్క- 2గ్రా
లవంగాలు -2 గ్రా
ఉప్పు- తగినంత
నూనె- 60గ్రా
తయారు చేసే విధానం
1 ) ఎండు మిర్చిని తుంచి అందులోని విత్తుల్ని తొలగించండి. ఈ ఎండు మిర్చి,మిరియాలు,జీలకర్ర ,లవంగాలు,దాల్చిన చెక్క- వెనిగర్ లో వేసి నానబెట్టండి.పిదప ఈ మిశ్రమాన్ని కాటుకలా మెత్తగా రుబ్బండి
2)చికెన్ ముక్కలకు అల్లంవెల్లుల్లి ,ఉప్పు,పట్టించి నానబెట్టండి.
3 )బాణలి లో నూనె పోసి వేడి చేయండి. ఇందులో మసాలాముద్ద ను వేసి వేయించండి. నూనె పైకి తేలుతున్నప్పుడు చికెన్ ముక్కలు వేసి కలియబెట్టండి.బాగా ఉడికే వరకు కలపండి.ఆ పైన పొడి పొడి గా అయ్యే వరకు చికెన్ ను వేయించండి.ఇప్పుడు చికెన్ పెరి పెరి తినడానికి రెడీ......

అరటికాయ వడలు

కావాల్సినవి
అరటికాయలు -రెండు
అల్లం-చిన్న ముక్క
పచ్చి మిర్చి -అరడజను
ఉల్లిపాయలు - 50 గ్రా
కొత్తిమీర -ఒక కట్ట
కరివేపాకు -అయిదు రెబ్బలు
ఉప్పు -తగినంత
నూనె -వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం

1)అరటికాయలను నీటిలోబాగా ఉడికించుకోవాలి.తరువాత తొక్క వలిచి ముద్ద గా చేసుకోవాలి.
2 )తరువాత ఆ ముద్ద లో సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి ,ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలపండి.
3)ఇప్పుడు ఇలా చేసిన అరటికాయ ముద్ద ను చిన్న చిన్న ఉండలు గా చేసి,తడి చేతి తో వత్తి ,వడలు మాదిరిగా చేసి మరుగుతున్న నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేయాలి.
4)వీటిని సాస్ తో గాని ,పుదిన చెట్నీ తో గాని తింటే చాలా రుచి గా ఉంటాయి.

Sunday, January 4, 2009

చాక్లెట్ పుడ్డింగ్

కావసినవి
పాలు -అర లీటరు
కోకో పౌడర్ - 50 గ్రా
గుడ్లు -మూడు
పంచదార - 100 గ్రా
వెన్న - 60 గ్రా
మైదా - 3 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ - 3టేబుల్ స్పూన్స్
తయారు చేసీ విధానం
1) ఒక గిన్నె లో కోకో పౌడర్ ,కార్న్ ఫ్లౌర్ ,కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ సాస్ తయారు చేయండి.
2)తరువాత వేరే గిన్నె లో కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసి ,అందులో పంచదార కలిపి బాగా కలియబెట్టండి.ఆ తరువాత ఆ గిన్నె లోనే పాలు కూడా పోయండి.
3)ఇప్పుడు అందులో పైన తయారు చేసి ఉంచిన చాక్లెట్ సాస్ ను పోసి మిశ్రమంలా చేయండి.తరువాత వెన్న పూసిన గిన్నె లో పాల మిశ్రమాన్ని పోసి గిన్నె మీద మూత పెట్టి స్టీంలో గాని,స్టీం పైన గాని పది నిమిషాల పాటు ఉడికించి తీసి,ముక్కలు గా కోస్తే చాక్లెట్ పుడ్డింగ్ తినడానికి రెడీ ..........

ములక్కాయ కొబ్బరి కూర

కావలసినవి
ములగాకాడలు -అయిదు
టమోటాలు - 150 గ్రా
కొబ్బరి-సగం చెక్క
ఉల్లిపాయలు- 50గ్రా
పచ్చిమిర్చి- అయిదు
పోపు సామగ్రి - 1/4 టీ స్పూన్
పసుపు - చిటికెడు
కరివేపాకు -ఒక కట్ట
ఉప్పు -తగినంత
నూనె -తగినంత
తయారు చేసీ విధానం
1)ఒక బాణలి లో నూనె వెసి కాచిన తరువాత పోపు వేసి ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేసి వేయించండి.
2 )తరువాత అందులో ములగకాడ ముక్కలు ,కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.
3 ) ముక్కలు వుడుకుతూ ఉంటే తగినంత ఉప్పు ,టమోటాలు,కరివేపాకు,కారం వేసి ఇగురు గా తయారు చేయండి .తరువాత కొబ్బరి తురుము వేసి కొంచెం సేపు ఉడికిస్తే ములక్కాయ కొబ్బరి కూర తయార్ .............