Tuesday, January 27, 2009

రిబ్బన్ పకోడీ

కావాల్సినవి:
సెనగపిండి- 400 గ్రా
బియ్యప్పిండి- 100 గ్రా
కొత్తిమీర- 4కట్టలు
పచ్చి మిర్చి-ఐదు
ఉప్పు-తగినంత
జీలకర్ర పొడి- 1టీ స్పూన్
కారం- 1టీ స్పూన్
నెయ్యి- 50గ్రా
నూనె-వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం:
1)సెనగపిండి,బియ్యప్పిండి కలిపి జల్లించండి.ఇందులో ఉప్పు,సన్నగా తరిగిన కొత్తి మీర,పచ్చిమిర్చి,జీలకర్రపొడి,కారం కలపండి.
2 )తరువాత వేడి చేసిన నెయ్యిని పిండి లో పోసి కలియబెట్టండి.తరువాత ఇందులో నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయండి.
3 )జంతికల గొట్టం లో రిబ్బన్ ఆకారంలో వచ్చే అచ్చును ఉంచి,ముందుగా కలిపిన పిండిని పెట్టి-వేడి నూనెలో వత్తి ఎర్రగా వేయించండి.నోరూరించే రిబ్బన్ పకోడీ రెడీ..........

No comments:

Post a Comment