Thursday, January 22, 2009

దేవి ప్రసాదం

కావలసినవి:
గోధుమ రవ్వ - 250 గ్రా
బెల్లం -350 గ్రా
నెయ్యి - 100 గ్రా
యాలకులు-5 గ్రా
జీడి పప్పు - 25 గ్రా
కిస్ మిస్ - 25 గ్రా
పచ్చి కోవా - 50 గ్రా
తయారు చేసే విధానం :
1)ముందు గా సన్నని గోధుమ రవ్వను ,జీడిపప్పు ,కిస్ మిస్ లను కలిపి ఒక గిన్నె లో వేయండి.ఆ తరువాత యాభయ్ గ్రాముల నెయ్యి ని చేర్చి గోధుమ నూక ను ఎర్రగా వేయించండి.
2 ) ఆ తరువాత ఆ నూక లో రెండున్నగ్లాసుల నీళ్లు పోసి బాగా కలియబెట్టి గిన్నె మీద మూత పెట్టి నూకను ఉడికించండి.
3 )గిన్నె లో నీళ్లు ఇంకిపోయిన తరువాత ముందు గానే తయారు చేసిన బెల్లం పాకాన్నివేసి ,సన్నని మంట మీద కలుపుతూ నూక ను ఉడికించండి.
4 )ఇప్పుడు బెల్లం పాకం,రవ్వలో బాగా ఇంకి ముద్ద గా తయారయ్యాక గ్ర పొడి,మిగిలిన నెయ్యి,ఎయ్యిచ్చి కోవాలు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాక దించి ,అతిధులకు అందించండి........

No comments:

Post a Comment